కావలసిన పదార్థాలు:
రాగి పిండి - 300 గ్రా
బియ్యం పిండి - 75 గ్రా
చిక్కటి, పుల్ల పెరుగు - 50 గ్రా
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - 5 గ్రా
ఆవాలు - టీస్పూను
జీలకర్ర - టీస్పూను
ఎండుమిర్చి - 3
ఉప్పు - తగినంత
నీళ్లు - 100 మి.లీ
తయారీ విధానం:
గిన్నెలో రాగి, బియ్యం పిండిలకు ఉప్పు చేర్చి కలుపుకోవాలి.
పెరుగు కూడా చేర్చి కలిపి పక్కనుంచాలి.
ఆవాలు, జీలకర్ర, తరిగిన ఎండుమిర్చితో తాలింపు వేయాలి.
ఈ తాలింపును పిండిలో పోయాలి.
ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర, కరివేపాకు కూడా పిండిలో వేసి కలపాలి.
నీళ్లు పోసి పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి.
వేడి పెనం మీద దోశలు పోసుకుని నూనె పోస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి.
Showing posts with label Curd (Sour). Show all posts
Showing posts with label Curd (Sour). Show all posts


